తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2020, 6:05 PM IST

ETV Bharat / city

ఉచిత క్యాంటీన్​ను ప్రారంభించిన మంత్రి

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ కూడలిలో ఉచిత క్యాంటీన్​ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తోన్న వారికి అండగా నిలిచేందుకే క్యాంటీన్​ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

Minister Opened Free Meals canteen
ఉచిత క్యాంటీన్​ను ప్రారంభించిన మంత్రి

లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల కోసం వరంగల్​ పట్టణంలో ఉచిత క్యాంటీన్​ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ కూడలిలోని క్యాంటీన్​ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ ప్రారంభించారు. లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తోన్న వారికి అండగా నిలిచేందుకే క్యాంటీన్​ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

లాక్​డౌన్​లో కార్మికులకు, కూలీలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. వలస కూలీలకు ప్రభుత్వమే వసతి కల్పిస్తోందని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఉచిత క్యాంటీన్​ను ప్రారంభించిన మంత్రి

ఇవీ చూడండి:మారువేషంలో జేసీ.. అధిక ధరలపై ఆరా...

ABOUT THE AUTHOR

...view details