తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం

తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంది గొప్ప వైద్యులను అందించిన కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. 1959లో ప్రారంభమైన ఈ కళాశాల నుంచి వచ్చిన ఎంతో మంది వైద్యులు వైద్య రంగంలో తమవంతు సేవ చేస్తున్నారు. ఈ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు, ప్రముఖ వైద్యులు వేడుకల్లో పాల్గొన్నారు.

By

Published : Jul 20, 2019, 2:53 PM IST

Updated : Jul 20, 2019, 4:00 PM IST

kakatiya medical college celebrates its silver jublee health minister and panchayatraj minister attended the ceremony as chief guests

ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం

రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే గాక మానవసంబంధాలనూ పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవ వేడుకలను మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఘనంగా ప్రారంభించారు.

మార్పులకనుగుణంగా అభివృద్ధి

వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసి త్వరలోనే వైద్యరంగంలో చెరగని ముద్ర వేస్తామని మంత్రి ఈటల తెలిపారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్​ వంటి పథకాలతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

చదవలేదన్న బాధ

తాను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఉన్నత విద్యనభ్యసించలేదన్న బాధ తనను ఎల్లప్పుడు వేధిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ విరాళాలను కలెక్టర్​ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు అందించాలని విన్నవించారు.

పూర్వ విద్యార్థులకు సన్మానం

ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి పూర్వ విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కళాశాల ప్రస్తుత విద్యార్థులు పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో ఎంపీలు దయాకర్, బండ ప్రకాశ్, మేయర్​ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు రాజయ్య, వినయ్​ భాస్కర్​లు పాల్గొన్నారు.

Last Updated : Jul 20, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details