తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా ధనికుల పార్టీ.. కాంగ్రెస్​ రైతు పక్షపాతి!

కాంగ్రెస్​ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. తమ విజయం కోసం పోరాడేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. నాగర్​కర్నూలు పార్లమెంటు పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మల్లురవి దిశానిర్దేశం చేశారు.

By

Published : Mar 26, 2019, 6:11 AM IST

Updated : Mar 26, 2019, 9:48 AM IST

కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నాగర్ కర్నూల్​ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సమరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏడాదికి ప్రతి పేద కుటుంబానికి రూ.72 వేలు నేరుగా అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని అభ్యర్థి మల్లు రవి తెలిపారు. భాజపా ధనికుల పార్టీ అని.... కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని అభివర్ణించారు.కాంగ్రెస్​ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నేతలు సూచించారు.
Last Updated : Mar 26, 2019, 9:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details