తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2021, 12:12 PM IST

Updated : Sep 7, 2021, 12:46 PM IST

ETV Bharat / city

vote for note case : సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసు
ఓటుకు నోటు కేసు

12:08 September 07

vote for note case : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా వేసిన సుప్రీం

ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లపై విచారణ చేపట్టింది. పూర్తి వివరాలను మూడు పేజీల్లో దాఖలు చేయాలని వాద, ప్రతివాదులు ఇద్దరికి జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. 

 ఇప్పటికే ఈ కేసులో..  విచారణ నిమిత్తం రేవంత్‌రెడ్డి..  పలుమార్లు అనిశా ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహాలను కూడా అధికారులు విచారించారు. 

Last Updated : Sep 7, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details