తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 12:49 PM IST

ETV Bharat / city

'నిరుద్యోగుల బలిదానాలపై కేసీఆర్ సమాధానం ఇవ్వాలి'

తెలంగాణలో నిరుద్యోగులు బలిదానాలు చేసుకోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

kishan reddy, central minister kishan reddy
కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కంటే రాజకీయమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ప్రజాస్వామ్య పద్ధతిలో అనుకున్న సిద్ధాంతం కోసం పనిచేయాలని నక్సలైట్లకు కిషన్ రెడ్డి సూచించారు. హింస, తుపాకుల ద్వారా ఏం సాధించలేరని హితవు పలికారు. హింస ద్వారా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. హింసను విడనాడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details