తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS Dharna over Paddy procurement :' రైతును కష్టపెట్టిన ఏ సర్కార్ నిలబడలే'

వరి ధాన్యం కొనుగోళ్ల(TRS Dharna over Paddy procurement) విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాకు దిగింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిస్తున్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్రమే తాము కొనమని చెబితే.. రైతులు ఎక్కడికి పోవాలని.. పండించిన పంటనంతా ఏం చేయాలని మంత్రులు మోదీ సర్కార్​ను ప్రశ్నించారు. కర్షకులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడినట్లు చరిత్రలో లేదని అన్నారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

By

Published : Nov 12, 2021, 11:59 AM IST

Updated : Nov 12, 2021, 3:56 PM IST

TRS Dharna over Paddy procurement
TRS Dharna over Paddy procurement

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస ధర్నా(TRS Dharna over Paddy procurement) చేస్తోంది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మోదీ సర్కార్​కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోంది. రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న వైఖరి పట్ల కేంద్రం మెడలు వంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.

తెరాస అంటే.. తెలంగాణ రైతు సమితి : కేటీఆర్​

ధాన్యం కొనుగోళ్లపై తెరాస ధర్నాలో భాగంగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ( ktr fires on bjp during trs dharna) పాల్గొన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. తెరాస శ్రేణులతో కలిసి ఆయన ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటి నుంచి తెరాస అంటే.. తెలంగాణ రైతు సమితి అని కేటీఆర్ ( ktr fires on bjp during trs dharna) స్పష్టం చేశారు. రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులంతా ఉద్యమించాలని సూచించారు.

కేసీఆర్ నాయకత్వంలో ఏడున్నరేళ్ల క్రితం మన పాలన ప్రారంభమైందని కేటీఆర్​ తెలిపారు. తెలంగాణ ఏర్పడక.. ముందు రైతుల దుస్థితి ఏందో ఆలోచించాలని సూచించారు. నాడు విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేసే (trs dharna on grain purchase) దుస్థితి ఉండేదని.. కాంగ్రెస్ హయాంలో కనీసం ఐదారు గంటలు కూడా విద్యుత్ వచ్చేది కాదని విమర్శించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారని.. గతంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పార్లమెంట్‌లోనే చెప్పారని కేటీఆర్​ గుర్తుచేశారు. నిరంతర విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన ఏకైక సీఎం మన కేసీఆర్. రైతులకు మంచి జరగాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.

సిరిసిల్లలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్​

రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదు..: శ్రీనివాస్​గౌడ్​

తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేవరకూ పోరాటం కొనసాగిస్తామని మంత్రి శ్రీనివాస్​గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్​నగర్​ జడ్పీ మైదానంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ మైదానం వరకు ఎడ్లబండిపై (trs dharna on grain purchase) ర్యాలీగా వచ్చారు. తెరాస సర్కారు.. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, బీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్​ , సాగునీరు సహా వివిధ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటోందని ( minister srinivas goud fires on bjp during trs dharna ) మంత్రి తెలిపారు. కోటి ఎకరాలకు పైగా సాగు పెరిగితే... తీరా పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయబోమంటే రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి ఇక్కడ పండే పంటలే రైతులు పండిస్తారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్​కు ఒక న్యాయం.. తెలంగాణకు మరొకటా అని నిలదీశారు. రైతు విషయంలో రాజకీయం తగదని, రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదని హితవు పలికారు.

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

'రైతన్నల నడ్డివిరిచేలా వ్యవహరిస్తోంది'

సమస్య తీవ్రతను చాటేలా తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణులు(TRS protest over paddy procurement) నిరసనకు దిగాయి. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తెరాస నేతలు ధర్నా(TRS dharna at Indira Park) చేపట్టారు. ఈ నిరసనలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలకు అండగా ఉండాల్సిన సర్కార్.. వారి నడ్డివిరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఇందిరాపార్కు వద్ద మంత్రులు తలసాని, మహమూద్ అలీ

సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు..

సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) పాల్గొన్నారు. రైతులతో కలిసి కేంద్ర సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ల నోట్లో మోదీ ప్రభుత్వం సున్నం కొట్టేందుకు యత్నిస్తోందని మంత్రి హరీశ్ విమర్శించారు.

రైతును మోసం చేసి ఎవరూ బాగుపడలే..

మేడ్చల్ డిపో ఎదుట తెరాస ధర్నాలో కార్మిక మంత్రి మల్లారెడ్డి(Telangana labor minister Malla Reddy) రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం.. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నదాత నడ్డివిరుస్తోందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కర్షకులను కష్టపెట్టే.. రైతులను మోసం చేసే ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం బాగుపడినట్లు చరిత్రలో లేదని చెప్పారు.

ఖమ్మంలో తెరాస ధర్నా..

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్​లో(TRS dharna at Khammam) తెరాస ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

ఖమ్మంలో రైతులకు మద్దతుగా పువ్వాడ అజయ్

అప్పటివరకు మా పోరాటం ఆగదు..

వ్యవసాయరంగాన్ని ప్రవేటుపరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Telangana minister errabelli dayakar rao) ఆరోపించారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్​సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా రైతుల నుంచి వరి ధాన్యం కొనేవరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.

బండి సంజయ్​ అయోమయానికి గుర్తిచేస్తున్నారు..: వేముల

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్​ ఎక్స్​ రోడ్​ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి (minister Prasanth reddy at trs dharna) ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతోందని మండిపడ్డారు. యాసింగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతుంటే.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్​ మాత్రం వరి వేయాలంటూ రైతును అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ

ఇక్కడ సబితా.. అక్కడ నిరంజన్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో(TRS dharna in rangareddy) తెరాస ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొనగా.. రైతులకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలో వనపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట కేంద్ర సర్కార్​కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్(Telangana agriculture minister Niranjan reddy) రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్వరంలో తెరాస ధర్నాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Last Updated : Nov 12, 2021, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details