తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఇవాళ మరో 49 కరోనా కేసులు

ఇవాళ మరో 49 కరోనా కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 453కు చేరాయని అన్నారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనా బాధితులు ఎవరూ వెంటిలేటర్లు, ఐసీయూల్లో లేరని చెప్పారు.

By

Published : Apr 8, 2020, 7:01 PM IST

Updated : Apr 8, 2020, 7:49 PM IST

eelata
eelata

కరోనా చికిత్సకు 22 ప్రైవేటు వైద్య కళాశాలలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15,040 పడకలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో మందుల కొరత లేదని పేర్కొన్నారు.

కరోనా బాధితులకు సాధారణ చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో 80 వేల పీపీఈ కిట్లు నిల్వ ఉన్నాయి. మరో 5 లక్షల పీపీఈ కిట్ల కోసం ఆర్డర్‌ ఇచ్చాం. లక్షకు పైగా ఎన్‌95 మాస్కులు ఉన్నాయి. 20 లక్షల గ్లౌజులు అందుబాటులో ఉన్నాయి. మరో కోటి గ్లౌజుల కోసం ఆర్డర్‌ ఇచ్చాం. మాస్కులు, 5 లక్షల గాగుల్స్‌ కోసం ఆర్డర్‌ ఇచ్చాం. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశాం.

- ఈటల రాజేందర్

రాష్ట్రంలో ఇవాళ మరో 49 కరోనా కేసులు

ఇదీ చూడండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి

Last Updated : Apr 8, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details