తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2022, 7:00 AM IST

ETV Bharat / city

Top Ten News: టాప్​టెన్​ న్యూస్​ @7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @7AM
top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @7AM

  • 'మార్పునకు తరుణమిదే'

CM KCR MUMBAI TOUR: దేశంలో గుణాత్మక మార్పునకు సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే అభిప్రాయపడ్డారు. దేశ హితం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌ పవార్‌లతో చర్చించిన కేసీఆర్​​.. త్వరలో దేవెగౌడ, స్టాలిన్‌లతోనూ సమావేశం కానున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

  • నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన

CM KCR SANGAREDDY TOUR: కరవు సీమకు గోదావరి జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేసేలా రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

  • కేసీఆర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా ప్రకాశ్​రాజ్​

Prakash Raj With KCR: సీఎం కేసీఆర్​ ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్​రాజ్​ సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచారు. స్వాగతం పలకటం దగ్గర్నుంచి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కేసీఆర్​ వెంటే ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకూ.. కేసీఆర్​ పర్యటనలో ఎవరూ ఊహించని విధంగా.. ప్రకాశ్​రాజ్​ ఇంత చురుకుగా పాల్గొనటానికి కారణాలేంటీ..?

  • 'తెలంగాణ విధానాలు దేశవ్యాప్తం కావాలి'

KTR in Harvard India Conference: దేశంలో ఉన్నవనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశం పురోగతి ఆపడం ఎవరి తరం కాదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. "2030 నాటికి భారతదేశ అభివృద్ధి" అనే అంశంపైన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ దృశ్యమాద్యమం ద్వారా మాట్లాడారు. భారత్​ అభివృద్ధి మరింత వేగవంతంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

  • ఘోర ప్రమాదం

మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో తల్లీకుమార్తె మృతి చెెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

  • నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ

Regularisation From Today: ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు.

  • 'విపక్షాల పోటీ రెండో స్థానం కోసమే'

Yogi Adityanath: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పోటీపడటం లేదని అన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్​. విపక్షాలు ద్వితీయ స్థానం కోసమే పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులంటే సమాజ్​వాదీకి సానుభూతి అని ఆరోపించారు. ఆ పార్టీలో కించిత్తు మార్పు లేదని అన్నారు.

  • 'పుతిన్​తో చర్చలకు బైడెన్​ సిద్ధం'

Ukraine crisis: ఉక్రెయిన్​తో రష్యా యుద్ధాన్ని నివారించేందుకు పుతిన్​తో బైడెన్​ చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. రానున్న రోజుల్లో రష్యా దాడి చేయకుండా ఉంటే తాను కూడా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్​ను కలవనున్నట్లు చెప్పారు.

  • టీ20ల్లో అగ్రస్థానానికి టీమ్​ఇండియా

IND vs WI: వన్డే సిరీస్​లో 3-0తో విజయభేరీ మోగించిన టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​లోనూ అదే ఫలితం ఫునరావృతం చేసింది. దీంతో కెప్టెన్​గా రోహిత్ శర్మకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఈ సిరీస్​ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్​ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది.

  • ఆలియా సినిమాపై కంగన షాకింగ్​ కామెంట్స్

Kangana alia bhatt: ఆలియా కొత్త సినిమాపై కంగనా రనౌత్ పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. రూ.200 కోట్లు బూడిద అవుతుందని ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

ABOUT THE AUTHOR

...view details