తెలంగాణ

telangana

శ్రీశైలానికి స్వల్ప ప్రవాహం... మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని జలయాశంలో గరిష్ఠ స్థాయిలో నిల్వ చేస్తూ రాయలసీమ పథకాలకు సరఫరా చేస్తున్నారు.

By

Published : Sep 10, 2020, 5:38 PM IST

Published : Sep 10, 2020, 5:38 PM IST

శ్రీశైలానికి స్వల్ప ప్రవాహం... మూడు గేట్లు ఎత్తివేత
శ్రీశైలానికి స్వల్ప ప్రవాహం... మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 98,270 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద పెరగడంతో శ్రీశైలం జలాశయం మూడు గేట్లను పైకెత్తి దిగువ నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు.

రాయలసీమ పథకాలకు..

జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని గరిష్ఠ స్థాయిలో నిల్వ చేస్తూ రాయలసీమ పథకాలకు నీరు అందిస్తున్నారు. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,567 క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు.

ఇవీ చూడండి : షీర్వాల్‌ టెక్నాలజితో డబుల్ బెడ్ రూం ఇళ్లు: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details