తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు'

సర్కారు బడుల్లో ఖాళీలను భర్తీచేయాలంటూ నిరుద్యోగులు హైదరాబాద్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్​ వద్ద మహాధర్నా నిర్వహించారు. వీరికి మద్దతు తెలిపిన ఆర్​.కృష్ణయ్య... ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

By

Published : Aug 17, 2019, 5:58 PM IST

ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు: ఆర్​.కృష్ణయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్​ పోస్టులను భర్తీ చేయాలంటూ హైదరాబాద్​లో నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. లక్డీకపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య మద్దతు తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన నుంచి ఒక్కసారి కూడా టెట్​ పరీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్రాలో లక్ష ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు జరుగుతుంటే.. ఇక్కడ మాత్రం లక్ష గొర్రెలు, బర్రెలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే అన్ని స్థాయిలోని ఖాళీలను భర్తీ చేయకుంటే నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు: ఆర్​.కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details