తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆత్మల పండగలో పాల్గొన్న మంత్రి కొప్పుల

హైదరాబాద్​లో క్రైస్తవులు ఆత్మల పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్​ హాజరయ్యారు.

By

Published : Nov 2, 2019, 8:43 PM IST

ఆత్మల పండగలో పాల్గొన్న మంత్రి ఈశ్వర్

హైదరాబాద్​లోని నారాయణగూడలో క్రైస్తవ సోదరులు ఆత్మల పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. బరియల్​ గ్రౌండ్​లో ఉన్న శ్మశాన వాటికలోని వారి కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. సమాధులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ పండగ సందర్భంగా చనిపోయిన కుటుంబసభ్యుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారని మంత్రి తెలిపారు. శ్మశాన వాటికలో ఎక్కువ స్థలం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాస్టర్లు మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.

ఆత్మల పండగలో పాల్గొన్న మంత్రి కొప్పుల

ABOUT THE AUTHOR

...view details