తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2020, 9:33 PM IST

ETV Bharat / city

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్​ బొంతురామ్మోహన్​

హైదరాబాద్ ఐఎస్ డివిజన్ సింగరేణి కాలనీలోని ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. అపార్ట్​మెంట్లలో ఉన్న వారికి నిత్యావసరాలు అందించి... సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్లు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్​ బొంతురామ్మోహన్​
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్​ బొంతురామ్మోహన్​

హైదరాబాద్ ఐఎస్ డివిజన్ సింగరేణి కాలనీని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. అపార్ట్​మెంట్లో ఉన్నవారికి పాల ప్యాకెట్లు, మంచినీరు, ఆహారం అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేయర్ ముందు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరిస్తామని మేయర్​ హామీ ఇచ్చారు.

వరద ప్రాంతంలోని పలువురిని ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో స్థానిక కార్పొరేటర్ సప్న రెడ్డి వేరే ప్రాంతాలకు తరలించారు. డివిజన్లలోని కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని మేయర్​ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండిఃఎస్సార్​ నగర్​లో కరెంట్​ షాక్​ తగిలి.. బార్​ క్యాషియర్​ మృతి

ABOUT THE AUTHOR

...view details