తెలంగాణ

telangana

ETV Bharat / city

నిప్పులు కక్కుతున్న సూరీడు.. ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు

భానుడు రోజురోజుకు మండిపడుతున్నాడు. నిప్పులు కక్కుతూ... జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అత్యధిక ఉష్టోగ్రతలు నమోదు చేస్తూ... బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

By

Published : Apr 3, 2021, 5:06 PM IST

sun stroke, sunny effect, temperature
రాష్ట్రంలో ఈరోజు, రేపు వడగాలులు... ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఇప్పటికే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం పూట మాడు పగిలేలా ఎండలు దండి కొడుతున్నాయి. ఈ క్రమంలో... రాష్ట్రంలో ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి రెండు ప్రదేశాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరగనున్నాయని తెలిపింది.

ఈరోజు, రేపు... మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, మహబూబ్​నగర్, నారాయణపేట్ జిల్లాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: కారులో మంటలు రావడానికి 5 కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details