తెలంగాణ

telangana

KRMB: ఆ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు.. ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

By

Published : Sep 7, 2021, 8:09 PM IST

Updated : Sep 7, 2021, 9:13 PM IST

krishna-river-management-board-letter-to-ap-govt
krishna-river-management-board-letter-to-ap-govt

20:06 September 07

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

వెలిగొండతో పాటు తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్​లు తక్షణమే సమర్పించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపురే ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిర్యాదు చేసింది. 

అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఆపాలని కేఆర్ఎంబీని కోరింది. తెలంగాణ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్​ను కోరిన కృష్ణాబోర్డు... రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లు ఇవ్వాలని కోరింది. తెలంగాణ ఫిర్యాదును కూడా లేఖతో పాటు జతపరిచారు.  

ఇదీ చూడండి:

Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...

Last Updated : Sep 7, 2021, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details