తెలంగాణ

telangana

GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్​ మహానగరం రోడ్లపై వ్యర్థాలు వేసే వారిపై చర్యలు తీసుకుంటోంది జీహెచ్​ఎంసీ. రోడ్లపై మట్టి, వ్యర్థాలు వేస్తున్న వారికి జరిమానాలు వేస్తోంది. మాదాపూర్ ఖానామెట్‌లో అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది.

By

Published : Sep 13, 2021, 4:29 PM IST

Published : Sep 13, 2021, 4:29 PM IST

GHMC
GHMC

హైదరాబాద్ రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ (GHMC) చర్యలు తీసుకుంటోంది. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం (Sai Dharam Tej road accident) నేపథ్యంలో రోడ్లపై వ్యర్థాలు వేసే వారికి జరిమానాలు విధిస్తోంది. నగరంలోని మాదాపూర్ ఖానామెట్​లో అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి బల్దియా లక్ష రూపాయల జరిమానా విధించింది. భవన నిర్మాణాల సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, ఇతర వ్యర్థాలు రాకుండా సంబంధిత నిర్మాణదారులు చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. లక్ష రూపాయల జరిమానా చలాన్​ను కంపెనీ ప్రతినిధులకు జీహెచ్ఎంసీ చందానగర సర్కిల్ అధికారులు అందించారు.

రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధిలో శుక్రవారం రాత్రి సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది (Sai Dharam Tej road accident). కేబుల్ బ్రిడ్జి(Hyderabad Cable bridge) వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు. ప్రమాదంలో ఆయన కుడి కంటి పైభాగం, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాపూర్‌ ఏసీపీ ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని.. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత కథనం :హీరో సాయిధరమ్​ తేజ్​ ప్రమాదానికి అదే కారణం: మాదాపుర్ డీసీపీ

బల్దియాపై కేసు లేదా?

సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదానికి సంబంధించి అతి వేగంపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన నిర్మాణ సంస్థ, ఎప్పటికప్పుడు రోడ్డుని శుభ్రం చేయని బల్దియాపైనా కేసులు పెట్టాలని సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ (RP Patnaik) పేర్కొన్నారు. దీనివల్ల అజాగ్రత్తగా వ్యవహరించేవాళ్లు అప్రమత్తమవుతారని ఆ మేరకు చర్యలు తీసుకుంటారని అభిప్రాయపడుతూ ఆర్‌పీ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు. దీనికి నెటిజన్ల మద్దతు లభిస్తోంది.

సంబంధిత కథనం :సాయితేజ్​ యాక్సిడెంట్.. వారిపైనా కేసు పెట్టాలన్న ఆర్పీ పట్నాయక్

హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్​ను (Sai Dharam Tej health bulletin) అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వెల్లడించింది. ఆదివారం కాలర్‌ బోన్‌ సర్జరీ చేశారు. అది విజయవంతంగా పూర్తి అయింది. సాయి తేజ్‌ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.

సంబంధిత కథనం :ఫలించిన అభిమానుల పూజలు.. సాయిధరమ్​ తేజ్​ సర్జరీ విజయవంతం

ABOUT THE AUTHOR

...view details