తెలంగాణ

telangana

By

Published : Apr 15, 2020, 10:17 AM IST

ETV Bharat / city

నిత్యవసర సరకులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్​

హైదరాబాద్​ నాంపల్లిలోని మాలకుంట బస్తీలో సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్​ బాబా ఫసీయుద్దీన్​ నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు.

ghmc deputy mayor
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్​

లాక్​డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు ఆర్థికంగా బలంగా ఉన్నవారు ముందుకురావాలని జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్​ బాబా ఫసీయుద్దీన్​ కోరారు. హైదరాబాద్​ నాంపల్లిలోని మాలకుంట బస్తీలో సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. రోజువారి కూలీలను ఆదుకునేందుకు ముందుకువచ్చిన ఫౌండేషన్​ ఛైర్మన్​ రాజేశ్​ను డిప్యూటీ మేయర్​ అభినందించారు.

వైరస్​ కట్టడిలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల తోడ్పాటు లేనిదే కరోనా నియంత్రణ సాధ్యంకాదన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉంటూ దేశాన్ని కాపాడాలని కోరారు.

ఇవీచూడండి:దయనీయ స్థితిలో వలస కూలీ... కడుపు ఖాళీ

ABOUT THE AUTHOR

...view details