తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2021, 3:00 PM IST

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

టాప్​ టెన్​ న్యూస్​ @3PM
టాప్​ టెన్​ న్యూస్​ @3PM

ఘోర ప్రమాదం

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా శివార్లలోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తెదేపాకు రమణ గుడ్​బై

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ తీర్థం పుచ్చుకోవడంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పార్టీని వీడి తెరాసలో చేరే అంశంపై అనుచరులతో చర్చిస్తానని గురువారం రోజున రమణ తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర తెదేపా అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అత్యద్భుతంగా యాదాద్రి

శ్రీలక్ష్మీనరసింహస్వామి(sri lakshmi narasimha swamy) క్షేత్రం అత్యద్భుతంగా ముస్తాబవుతోంది. ప్రధాన ఆలయ తొలి ద్వారానికి ఇత్తడి తొడుగులు అమర్చుతున్నారు. పునర్నిర్మాణ పనులను యాడా(YADA) వేగవంతం చేసింది. వారం రోజుల్లో తాపడం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా ప్రభావం తక్కువే!

కరోనా కారణంగా చిన్నారులు మృతి చెందే ప్రమాదం చాలా తక్కువని ఓ పరిశోధన ద్వారా తేలింది. పిల్లలు, యువతలో కరోనా వల్ల తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం కూడా చాలా తక్కువేనని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ ప్లాంట్లు

దేశవ్యాప్తంగా 1500 ​ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆక్సిజన్‌ సరఫరా సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పీఎం కేర్స్‌ నిధుల ద్వారా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేరళలో జికా వైరస్​ విజృంభణ

కరోనాతో సతమతం అవుతున్న సమయంలో కేరళలో జికా వైరస్​ వ్యాప్తి కలకలం రేపుతోంది. కొత్తగా 14 కేసులు బయటపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆకలి అలజడి

ప్రపంచంలో ఆకలి చావులు తీవ్రమయ్యాయి. నిమిషానికి 11మంది ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆక్స్​ఫామ్​ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అటు ఆకలితో ప్రజలు మరణిస్తుంటే, ఇటు సైనిక కార్యకలాపాల కోసం ప్రపంచదేశాలు పెడుతున్న ఖర్చులు పెరిగిపోవడం ఆందోళనకరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వెనక్కి తగ్గిన వాట్సాప్​!

నూతన వ్యక్తిగత గోప్యత విధానంపై దిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వివరణ ఇచ్చింది. కొత్త పాలసీని అంగీకరించేలా వినియోగదారులను ఒత్తిడి చేయమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పాక్​కు ఝలక్​

ఇంగ్లాండ్ బౌలర్ సకీబ్ మహ్మూద్​ (4 వికెట్లు) ధాటికి తొలి వన్డేలో పాకిస్థాన్ విలవిల్లాడింది. 9 వికెట్ల తేడాతో పూర్తిగా యువ జట్టు అయిన ఇంగ్లాండ్​ చేతిలో ఓడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చెన్నై చేరుకున్న తలైవా

సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన సూపర్​స్టార్​ రజనీకాంత్​(Rajinikanth).. పూర్తిస్థాయి చికిత్స తర్వాత శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు చెన్నై ఎయిర్​పోర్ట్​ వద్ద అభిమానులు సందోహంగా వచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details