తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖేశ్​ గౌడ్​ కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ

దివంగత మాజీ మంత్రి ముఖేశ్​ గౌడ్​ కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు నాయడు పరామర్శించారు.

By

Published : Aug 3, 2019, 7:57 PM IST

Updated : Aug 3, 2019, 11:43 PM IST

ముఖేశ్​ గౌడ్​ కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ దివంగత మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్​ గౌడ్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్​లోని ముఖేశ్​ గౌడ్​ నివాసానికి వెళ్లిన చంద్రబాబు... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన ముఖేశ్​ గౌడ్​ అంచెలంచెలుగా మంత్రిగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు.

ముఖేశ్​ గౌడ్​ కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ
Last Updated : Aug 3, 2019, 11:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details