తెలంగాణ

telangana

ETV Bharat / city

బండి సంజయ్​ ఆగ్రహం.. కార్యక్రమం మధ్యలోనే..

భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా కొందిరిలో మార్పు రావడంలేదు. ఈ కారణమే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు చిరాకు తెప్పించింది. మల్కాజ్​గిరిలోని నిత్యవసరాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎంపీ స్థానికులను భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతకి వారు మాటవినలేదు. ఆగ్రహించిన సంజయ్​ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

By

Published : Apr 13, 2020, 3:47 PM IST

bandi sanjay
బండి సంజయ్​ ఆగ్రహం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆగ్రహానికి గురయ్యారు. మేడ్చల్​ జిల్లా మల్కాజ్​గిరిలోని ఆనంద్​బాగ్​లో ఎమ్మెల్సీ రామచందర్​తో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి సంజయ్​ హాజరయ్యారు. పలువురు పేదలకు సరుకులు పంపిణీ చేశారు. నిత్యావసరాల కోసం చిన్నపాటి తోపులాటే జరగ్గా.. ప్రజలు భౌతిక దూరం పాటించాలని సంజయ్​ విజ్ఞప్తి చేశారు. ఎంత చెప్పినా స్థానికులు మాట వినకపోయే సరికి ఎంపీ ఆగ్రహానికి గురయ్యారు. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బండి సంజయ్​ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details