తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2020, 12:02 PM IST

ETV Bharat / city

కర్నూలు జిల్లాలో ఇవాళ 3 కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలు జిల్లాలో ఇవాళ 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 4కు చేరాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి చేరింది.

coronavirus
coronavirus

కర్నూలు జిల్లాలో ఇవాళ 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4కు చేరాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 449 నమూనాలు సేకరించామని కలెక్టర్‌ వివరించారు. దిల్లీ జమాత్‌కు వెళ్లిన 338 మంది నమూనాలు ల్యాబ్‌కు పంపినట్టు పాలనాధికారి వీరపాండియన్ వెల్లడించారు.

ఇప్పటివరకు 90 మంది నమూనాల నివేదికలు వచ్చాయని కలెక్టర్‌ చెప్పారు. 90 మందిలో నలుగురికి మాత్రమే పాజిటివ్‌ వచ్చినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో ఇంకా 350 మంది నమూనాల ఫలితాలు రావాలని చెప్పారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది.

ఇదీ చూడండి:రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details