తెలంగాణ

telangana

ముషీరాబాద్​లో పరిధిలో.. 18 కరోనా కేసులు, ఒకరు మృతి

By

Published : Aug 25, 2020, 7:57 AM IST

హైదరాబాద్​లోని ముషీరాబాద్​ నియోజకవర్గంలో సోమవారం.. 18 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు. ముషీరాబాద్, బోలక్​పూర్, దోమలగూడలోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొవిడ్​ అనుమానితులతో కిక్కిరిసిపోతున్నాయి.

18 corona positive cases found in musheerabad constituency hyderabad
ముషీరాబాద్​లో పరిధిలో.. 18 కరోనా కేసులు, ఒకరు మృతి

హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో కొవిడ్​ కేసుల సంఖ్య 2815కు చేరుకొంది. నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్మెట్, బోలక్​పూర్, ముషీరాబాద్, గాంధీ నగర్, కవాడిగూడ డివిజన్లకు చెందిన కరోనా అనుమానితులు.. ముషీరాబాద్, బోలక్​పూర్, దోమలగూడలోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా ఆయా కేంద్రాలు కరోనా అనుమానితులతో కిక్కిరిస్తున్నాయి.

సోమవారం.. కొత్తగా 18 కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. బాకారానికి చెందిన ఒకరు కరోనాతో మృతిచెందారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 60 మంది మృతిచెందగా.. 2,352 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 403 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్ తెలిపారు

కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన వారికి జీహెచ్​ఎంసీ, ఆరోగ్య శాఖ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడంలేదని.. పలువులు బాధితులు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యలోపం ఉన్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:'వచ్చే రెండు నెలల్లో వైరస్‌ ఉద్ధృతి కొంత తగ్గొచ్చు'

ABOUT THE AUTHOR

...view details