తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2022, 11:25 AM IST

Updated : Nov 18, 2022, 12:49 PM IST

ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధరల స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold-price-today-in-hyderabad-and-vijayawada
gold-price-today-in-hyderabad-and-vijayawada

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధరల స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.54,500వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,940 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,500 గా ఉంది. కిలో వెండి ధర రూ.62,940 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,940గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,500 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,940 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,500 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.62,940గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,763.45 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.13 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,71,757 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,71,757
ఇథీరియం రూ.99,501
టెథర్​ రూ.81.58
బినాన్స్​ కాయిన్​ రూ.22,149
యూఎస్​డీ కాయిన్ రూ.81.55

స్టాక్​ మార్కెట్లు: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమ్మకాల సెగతో కాసేపటికే పూర్తిస్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల నష్టంతో 61,664 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 18,308 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, విప్రో, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, మారుతీ, టైటన్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో కొనసాగతున్నాయి.

రూపాయి విలువ:డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.54 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Nov 18, 2022, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details