తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్నికల భేరీతో సూచీల జోరు

సార్వత్రిక ఎన్నిక షెడ్యూల్​ విడుదలైన నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు లాభపడి 37,054 వద్ద నిలిచింది. నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11,168 వద్ద ముగిసింది.

By

Published : Mar 11, 2019, 5:19 PM IST

సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో లాభపడిన స్టాక్​మార్కెట్లు

సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 383 పాయింట్లకు ఎగబాకి 37,054 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11, 168 వద్ద నిలిచింది. ఆర్నెల్ల కాలంలో సెన్సెక్స్ 37 వేల మార్కును తొలిసారి దాటింది.

ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా సాగాయి. మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి కనబరిచారు. ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లాభపడిన షేర్లు...

విద్యుత్, బ్యాంకింగ్, లోహ, ఇంధన రంగ షేర్లు లాభాల్ని ఆర్జించాయి. రంగాల షేర్లు ఒక శాతానిగి పైగా లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్​టెల్, హెచ్​పీసీఎల్, ఐషర్ మోటర్స్ లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు...

ఎన్టీపీసీ, టెక్ మహీంద్ర, జీ ఎంటర్​టైన్​మెంట్, హెచ్​సీఎల్, టీసీఎస్ షేర్లు స్వల్ప నష్టాల్ని చవిచూశాయి.


ABOUT THE AUTHOR

...view details