తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాలపైనే మదుపరుల దృష్టి.. ఆవిరైన లాభాలు

ఉదయం నుంచి స్టాక్​ మార్కెట్లు గడించిన లాభాలు చివరి గంటలో ఆవిరయ్యాయి. సెషన్​ ఆఖరులో అమ్మకాలకే మదపరులు మొగ్గు చూపటం వల్ల స్వల్ప లాభాలతోనే మార్కెట్లు రోజును ముగించాయి. సెన్సెక్స్​ 52, నిఫ్టీ 6 పాయింట్లు లాభపడ్డాయి.

By

Published : Aug 19, 2019, 4:18 PM IST

Updated : Sep 27, 2019, 12:58 PM IST

స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు అతిస్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి లాభాల బాట పట్టిన మార్కెట్లు చివరి సెషన్​లో పట్టు కోల్పోయాయి. 52.16 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్​ 37,402 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 6.10 పాయింట్లు లాభపడి 11,053 వద్ద ముగిసింది.

పలు రంగాల్లో వృద్ధి​ మందగమనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్​ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్త పడ్డారు. చివరి గంటలో అమ్మకాలకు మొగ్గుచూపటం వల్ల మార్కెట్లు లాభాలు కోల్పోయాయి. షాడో బ్యాంకుల అంశంలో సమీక్షలపై ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ నిర్ణయం వెలువడిన తర్వాత బ్యాంకింగ్​ షేర్లు పడిపోయాయి.

మార్కెట్లకు రిలయన్స్​ భరోసా

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో పాటు రిలయన్స్​, ఐసీఐసీఐ షేర్ల కొనుగోలుతో ఉదయం సూచీలు ఉత్సాహంగా సాగాయి మార్కెట్లు. ఒకానొక దశలో సెన్సెక్స్​ 369 పాయింట్లు మెరుగుపడింది. నిఫ్టీ 11,100 మార్కుపైనే ట్రేడయింది.

యస్​ బ్యాంక్​, ఓఎన్​జీసీ, ఎస్బీఐ, మహింద్రా అండ్​ మహింద్రా, హీరోమోటోకార్ప్, టాటా స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ ​పవర్​ గ్రిడ్​ 3.46 శాతం నష్టపోయాయి. సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా, యాక్సిస్​ బ్యాంక్​, విప్రో 2.66 శాతం లాభపడ్డాయి.

డాలర్​తో రూపాయి మారకం విలువ 71.46గా కొనసాగుతోంది. బ్యారెల్​ ముడిచమురు ధర 58.97 డాలర్లు ఉంది.

ఇదీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్​కు తాళం వేయండిక!

Last Updated : Sep 27, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details