తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్లు భళా- లాభాల్లో సూచీలు

ఐటీ సంస్థల త్రైమాసిక ఫలితాలు సంతృప్తికరంగా ఉండడం, టోకు ధరల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్​ 130 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది.

By

Published : Jul 16, 2019, 10:17 AM IST

బ్యాంకింగ్​ షేర్లు భళా- లాభాల్లో సూచీలు


అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడ్డా... దేశీయంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా పెరిగి 39 వేల 40 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 11 వేల 630 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్​ రంగాల వాటాల కొనుగోలుకు మదుపర్లు అమితాసక్తి చూపుతున్నారు.

ఇవీ కారణాలు...

* దిగ్గజ ఐటీ సంస్థలు తొలి త్రైమాసికంలో సంతృప్తికర స్థాయిలో లాభాలు ఆర్జించడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.

* టోకు ధరల ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠ స్థాయికి దిగిరావడం దేశ స్థూల ఆర్థిక పరిస్థితిపై మదుపర్లలో భరోసా పెంచింది.

లాభనష్టాల్లో...

టాటా మోటర్స్​, వేదాంత, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్ 1.65 శాతం వరకు లాభపడ్డాయి.
టీసీఎస్​, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, ఎం అండ్​ ఎం, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, కోల్​కతా బ్యాంక్​ 1.62 శాతం వరకు నష్టపోయాయి.

రూపాయి... ముడిచమురు...

డాలరుతో పోల్చితే రూపాయి 68.55 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.12శాతం పెరిగి బ్యారెల్​కు 66.56 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:రెండేళ్ల కనిష్ఠానికి టోకు ధరల సూచీ

ABOUT THE AUTHOR

...view details