తెలంగాణ

telangana

ETV Bharat / business

టీసీఎస్​ నింపిన జోష్​- లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 74.74పాయింట్లు పుంజుకోగా... నిఫ్టీ20.85 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

By

Published : Apr 15, 2019, 10:47 AM IST

లాభాల్లో మార్కెట్లు

స్థిరమైన విదేశీ పెట్టబడుల ప్రవాహం, అంతర్జాతీయ అనుకూలతల మధ్య స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 74.74 పాయింట్ల లాభంతో 38,841.85 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20.85 పాయింట్ల స్వల్ప లాభంతో 11,664.30 వద్ద ట్రేడవుతోంది.

2019 మార్చి త్రైమాసికానికి రూ.8,126 కోట్ల నికర లాభం అర్జించినట్లు గత శుక్రవారమే ప్రకటించింది ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​). ఫలితంగా ఆ సంస్థ షేర్లు నేడు 3 శాతం వృద్ధితో కొనసాగుతున్నాయి.

లాభాల్లో ఉన్న మరిన్ని సంస్థలు

సెన్సెక్స్​లో... కోల్​ ఇండియా, టాటా మోటార్స్ ​, హెచ్​సీఎల్​ టెక్​, వేదాంత, టాటాస్టీల్​, హీరో మోటోకార్ప్​, కోటక్ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​​ బ్యాంక్​ సంస్థల షేర్లు 4.12 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో ఉన్నవి...

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ షేర్లు అత్యధికంగా 2.73 శాతం నష్టపోయాయి. భారతీ ఎయిర్​టెల్​, సన్​ ఫార్మా, ఎం అండ్​ ఎం, ఓఎన్​జీసీ, మారుతి సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలహీనపడిన రూపాయి

దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ అమెరికా డాలర్​తో పోలిస్తే 11 పైసలు క్షీణించి రూ.69.26 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details