తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

బంగారం, వెండి ధరల పెరుగుదలకు శుక్రవారం బ్రేక్ పడింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.388 తగ్గి 48 వేల మార్కును కోల్పోయింది. వెండి ధర భారీగా తగ్గి రూ.70వేల దిగువకు చేరింది.

By

Published : Jun 4, 2021, 3:27 PM IST

gold
బంగారం వెండి ధరలు

పసిడి, వెండి ధరలు తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.388 తగ్గి.. 47,917 వద్దకు చేరింది.

వెండి ధర సైతం భారీగా పతనమైంది. వెండి ధర రూ.920 (కిలోకు) తగ్గి.. రూ.69,369(దిల్లీలో) వద్ద స్థిరపడింది.

డాలర్, బాండ్లపై రాబడి పెరగనుందన్న సానుకూల అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,870 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 27.35 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇవీ చదవండి:అత్యవసరం తప్పక బంగారం తాకట్టు

ABOUT THE AUTHOR

...view details