తెలంగాణ

telangana

ETV Bharat / business

మిశ్రమ సంకేతాలు... ఆర్థిక షేర్లు ఆకర్షణీయం - నిఫ్టీ

వాణిజ్య యుద్ధ భయాలు నిన్న భారీ నష్టాల్లోకి నెట్టినా... తిరిగి  నేడు లాభాల్లో ప్రారంభయ్యాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్​ 90 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 15 పాయింట్లు బలపడింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : May 7, 2019, 9:53 AM IST

Updated : May 7, 2019, 10:51 AM IST

ఆర్థిక, ఐటీ షేర్ల ఊతంతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 90 పాయింట్లు బలపడి 38,690 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 11,613 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలు నేటి ట్రేడింగ్​ను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, ఐటీ రంగాల్లో మదుపరుల సెంటిమెంట్​ బలపడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.

చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధుల బృందం అమెరికాకు వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో చర్చలపై అంచనాలు మార్కెట్లకు సానుకూలంగా మారాయి.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో హిందుస్థాన్ యూనిలీవర్​, పవర్ గ్రిడ్​, ఇన్ఫోసిస్​, హీరో మోటార్స్, వేదాంత, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు షేర్లు ఒక శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

రిలయన్స్​, హెచ్​సీఎల్​ టెక్​, ఇండస్​ఇండ్ బ్యాంకు, యస్​ బ్యాంకు, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు ఫ్లాట్​గా ట్రేడవుతోంది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ 69.40 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ స్వల్పంగా తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 71.09 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇతరమార్కెట్లు ఇలా

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, హాంకాంగ్ సూచీ-హాంగ్​ సెంగ్​, జపాన్​ సూచీ-నిక్కీ దక్షిణ కొరియా సూచీ-కోస్పీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

Last Updated : May 7, 2019, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details