తెలంగాణ

telangana

ETV Bharat / business

వార్షిక ఫలితాలపై ఆశలతో స్వల్ప లాభాలు

వారంలో చివరి సెషన్​ను స్వల్ప లాభాలతో ప్రారంభించాయి స్టాక్​ మార్కెట్లు. సెనెక్స్ 36.13 పాయింట్లు పుంజుకోగా... నిఫ్టీ12.40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

By

Published : Apr 12, 2019, 10:15 AM IST

స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 36.13 పాయింట్ల లాభంతో 38,643.14 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12.40 పాయింట్ల స్వల్ప లాభంతో 11,596.70 వద్ద ట్రేడింగ్​ కొనసాగిస్తోంది.

దేశీయ కార్పొరేట్​ దిగ్గజాలు గత ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలపై సానుకూల అంచనాలతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక, ఔషధ, వాహన​ రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్​లో టీసీఎస్​, కోల్​ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్​, ఏషియన్​ పెయింట్స్, ఎల్​ ఆండ్​ టీ, ఎం అండ్​ ఎం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హెచ్​సీఎల్​ టెక్, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంకు, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడింగ్​ సాగిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details