తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆనిశ్చితులు బేఖాతరు.. ట్రేడింగ్​ సానుకూలం

స్టాక్​ మార్కెట్లు వారాంతపు ట్రేడింగ్​ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పుంజుకుని.. తిరిగి 37,500 స్థాయిని దాటింది. నిఫ్టీ 45 పాయింట్లు వృద్ధిచెందింది.

By

Published : May 17, 2019, 9:41 AM IST

Updated : May 17, 2019, 10:39 AM IST

స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ బలమైన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లు బలపడి.. 37,580 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11,305 వద్ద కొనసాగుతోంది.

లాభానష్టాల్లోనివే

బజాజ్​ ఫినాన్స్​, హీరో మోటార్స్​, యస్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఆటో, కోల్​ ఇండియా, ఎం&ఎం షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, వేదాంత, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం కారణంగా వరుసగా రెండో రోజు సంస్థ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇవీ కారణాలు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఫలితాలపై అంచనాలు సహా అమెరికా-చైనా మధ్య వాణిజ్య భయాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మదుపరుల సెంటిమెంట్ బలంగా ఉండి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని స్టాక్​ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక, లోహ రంగాల సానుకూల ట్రేడింగ్​ నేటి లాభాలకు ప్రధాన కారణం.

రూపాయి, ముడిచమురు

ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి 29 పైసలు క్షీణించింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 70.32 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.30 శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 72.84 డాలర్లకు చేరింది.

అసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లయిన చైనా, జపాన్​, దక్షిణ కొరియా సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండీ:ఇండిగో ఎయిర్​లైన్స్​ దారి ఎటు...?

Last Updated : May 17, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details