తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​ రంగంలో ప్రక్షాళన.. మరోసారి విలీనం

By

Published : Aug 30, 2019, 3:57 PM IST

Updated : Sep 28, 2019, 9:02 PM IST

మరోసారి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు..!

16:53 August 30

అతిపెద్ద బ్యాంకు ఎస్​బీఐ... రెండో అతిపెద్ద బ్యాంకు పీఎన్​బీ

బ్యాంకింగ్‌ రంగంలో అధునాతన సాంకేతికత వినియోగిస్తాం:నిర్మల

బ్యాంకులు ఇచ్చే వాణిజ్య రుణాల్లో కేంద్రప్రభుత్వ జోక్యం ఉండదు:నిర్మల

విలీనాల తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఎస్‌బీఐ,రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ

16:47 August 30

ఇండియా బ్యాంక్​, అలహాబాద్​ బ్యాంక్​...

ఇండియా బ్యాంక్​, అలహాబాద్​ బ్యాంక్​ కలిసి ఏడో అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడుతుందని తెలిపారు. 

16:44 August 30

బ్యాంకుల విలీనం..

యూనియన్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా​, ఆంధ్రా బ్యాంక్​, కార్పొరేషన్​ బ్యాంక్​ల విలీనం కానున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్​. ఇది ఐదో అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడుతుందని పేర్కొన్నారు. 

16:40 August 30

మరోసారి బ్యాంకుల విలీనం: నిర్మలా

బ్యాంకుల విలీనం అంశంపై మరో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​.

పీఎన్​బీ, ఓరియెంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​, యునైటెడ్​ బ్యాంకులు కలిసిపోతాయని సంకేతాలిచ్చారు. ఈ 3 ప్రభుత్వ బ్యాంకుల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడుతుందని స్పష్టం చేశారు. వీటి విలీనంతో రూ. 17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. 

16:36 August 30

బ్యాంకింగ్​ రంగం ప్రక్షాళనపై దృష్టి: నిర్మలా

బ్యాంకింగ్​ రంగం ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృషి పెట్టినట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​. రుణాల వసూళ్లపై బ్యాంకులు మరింత దృష్టి సారించాలని పేర్కొన్నారు. గృహ రుణాల మంజూరును మరింత సరళీతరం చేస్తామని తెలిపారు. 

  • రూ.250కోట్లు దాటిన రుణాలపై ప్రత్యేక ఏజెన్సీల ద్వారా పర్యవేక్షణ:నిర్మల
  • నీరవ్‌ మోదీ లాంటి ఉదంతాలు మరోసారి జరగకుండా చర్యలు:నిర్మల

16:27 August 30

బ్యాంకింగ్​ రంగంలో సంస్కరణలు

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకింగ్​ రంగంలో పలు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకుల వాణిజ్య నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ బ్యాంకులన్నీ లాభాల బాటలో పయనిస్తున్నట్లు పేర్కొన్నారు. 

16:25 August 30

ఎన్​బీఎఫ్​సీలకు మద్దతు పొడిగింపు

  • ఎన్‌బీఎఫ్‌సీలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తాం:నిర్మలా సీతారామన్‌
  • రుణాల రికవరీలో మరింత పురోగతి సాధించాయి:నిర్మలా సీతారామన్‌

16:20 August 30

బ్యాంకింగ్​ రంగంలో సంస్కరణలు

నిర్మలా సీతారామన్​ మీడియా సమావేశం

  • 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం.
  • గృహ,వాహనాల,తనఖా రుణాలను8ప్రభుత్వ బ్యాంకులు ప్రారంభించాయి.
  • బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నాం.
  • సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలి. 

16:16 August 30

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చర్యలు..

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్ష చేయనున్నట్లు తెలిపారు నిర్మలా. 

15:58 August 30

స్థిరాస్తి రంగంలో రాయితీలు..?

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. వృద్ధి మందగిస్తున్న పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ఇటీవల  సర్​ఛార్జీల ఉపసంహరణ, అధిక పన్నుల తగ్గింపు చర్యలు చేపట్టింది. విదేశీ పెట్టుబడులు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మరోసారి ఆ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగించనున్నట్లు తెలుస్తోంది. 

15:50 August 30

పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం మరోసారి బొనాంజా!

పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వినియోగం పెరిగేలా తగు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 

Last Updated : Sep 28, 2019, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details