తెలంగాణ

telangana

ETV Bharat / business

పండుగ సీజన్​లో 'ఆటో'కు కాస్త ఊరట.. కానీ!

దేశీయంగా ఈ అక్టోబరు నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు కాస్త పెరిగాయి. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ సారి 0.28 శాతం పెరిగాయని ఆటోమొబైల్​ తయారీదారుల సంఘం సియామ్​ తెలిపింది. అక్టోబర్​ నెలలో కాస్త పెరిగినప్పటికి గత 12 మాసాలలో మాత్రం వాహనాల అమ్మకాలు మందగమనంలోనే ఉన్నట్లు వెల్లడించింది.

By

Published : Nov 11, 2019, 1:18 PM IST

Updated : Nov 11, 2019, 10:09 PM IST

అక్టోబరులో ప్రయాణ వాహనాల అమ్మకాల వృద్ధి

అక్టోబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్‌లో 2 లక్షల 84 వేల223 యూనిట్లుగా ఉన్న వాహన అమ్మకాలు ఈ అక్టోబర్‌ నాటికి 0.28 శాతం పెరిగి 2 లక్షల 85 వేల 27 యూనిట్లకు చేరాయి. ఈ మేరకు భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది.

బైకుల కంటే కార్ల అమ్మకాలు తక్కువే!

కార్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 6.34 శాతం క్షీణించాయి. 2018 అక్టోబర్‌లో లక్షా 85వేల 400 యూనిట్ల కార్ల అమ్మకాలు జరగ్గా ఈ అక్టోబర్ నాటికి లక్షా 73 వేల 649 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15.88 శాతం క్షీణించినట్లు సియామ్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో 13 లక్షల27 వేల 758 మోటార్‌ సైకిళ్లు అమ్ముడవగా ఈ అక్టోబర్‌లో 11లక్షల 16 వేల 970 మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు జరిగాయి.

మొత్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 14.43 శాతం తగ్గినట్లు వివరించింది సియామ్. అక్టోబర్‌ నెలలో 17లక్షల 57వేల 264 ద్విచక్ర వాహనాలు అమ్ముడైనట్లు తెలిపింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 23.31శాతం శాతం క్షీణించినట్లు తెలిపిన సియామ్ అక్టోబర్‌లో 66 వేల 773 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది.

పండుగ సీజన్​లో 'ఆటో'కు కాస్త ఊరట!

వాహన విక్రయాలు పడిపోవటానికి ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతే కారణమని ఆటోమొబైల్ రంగం నిపుణులు రోహిత్​ అభిప్రాయపడుతున్నారు. కర్బన ఉద్గారాలకు సంబంధించి బీఎస్-4, బీఎస్-6 నిబంధనలకు విషయంలో ప్రజలు ఆలోచించి కొనుగోళ్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. మార్చి 2020 వరకు బీఎస్-4 వాహనాలను రిజస్ట్రేషన్ చేసుకోవచ్చని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినప్పటికి ప్రజలు వేచిచూసే ధోరణిలో ఉన్నారని రోహిత్​ వెల్లడించారు. మందగమనం కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు రోహిత్​.

హైదరాబాద్​లో...

హైదరాబాద్ లో కూడా మార్కెట్ మందగమనంలో కొనసాగుతుందని రోహిత్​ పేర్కొన్నారు. సంవత్సరం చివర్లో విక్రయాలు బాగుంటాయని, ఆ సమయంలో కొన్ని కంపెనీలు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటిస్తాయని.. దానివల్ల వచ్చే నెలలో అమ్మకాలు ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద మార్చి వరకు ఈ కొనుగోళ్లు నెమ్మదించటం కొనసాగుతుందని రోహిత్ అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: సిరి: మీరు ధనవంతులు కావడంలో అడ్డంకులు ఇవే!

Last Updated : Nov 11, 2019, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details