తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇండిగో ఎయిర్​లైన్స్​ దారి ఎటు...?

ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం తెలెత్తిన వార్తల నేపథ్యంలో ఇంటర్​గ్లోబ్​ సీఈఓ కీలక ప్రకటన చేశారు. ఆందోళన చెందొద్దని ఈ-మెయిల్​ ద్వారా సంస్థ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.

By

Published : May 16, 2019, 5:27 PM IST

ఇండిగో

ఇండిగో వృద్ధి ప్యూహాల అమలుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి యాజమాన్యానికి పూర్తి మద్దతు ఉన్నట్లు ఇండిగో మాతృ సంస్థ ఇంటర్​గ్లోబ్ సీఈఓ రొనోజాయ్ దత్​ వెల్లడించారు.

ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం నెలకొన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సంస్థ ఉద్యోగులకు ఈ మేరకు ఆయన ఈ-మెయిల్ ద్వారా భరోసా ఇచ్చారు.

"ఎయిర్​లైన్స్ వృద్ధి వ్యూహాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని నేను మీకు భరోసా ఇవ్వాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ల బోర్డు నుంచి యాజమాన్యానికి పూర్తి మద్దతు ఉంది. మన సంస్థ ప్రమోటర్ల మధ్య వివాదం తలెత్తినట్లు వస్తున్న వార్తలపై మీరంతా అప్రమత్తంగా ఉన్నారని నేను భావిస్తున్నాను."
- రొనోజాయ్​ దత్​, ఇంటర్​గ్లోబ్​ సీఈఓ

వివాదం ఏంటంటే...

మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం... ఇండిగోలో వ్యూహాలు, నిర్ణయాల విషయంలో సంస్థ ప్రధాన ప్రమోటర్లు రాహుల్​ భాటియా, రాకేశ్ గంగ్వాల్​ మధ్య అధిపత్య వివాదం తలెత్తింది.

ఈ అనిశ్చితుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి జే సాగర్​ అసోసియేట్స్​,​ ఖైతాన్ ​అండ్​ కోను న్యాయ సలహా కోరినట్లు తెలిసింది. వివాదం వార్తలపై స్పందించేందుకు ఇండిగో నిరాకరించింది.

ఇండిగోలో రాహుల్ భాటియాకు 38 శాతం వాటా ఉండగా.. రాకేశ్ గంగ్వాల్​కు 37 శాతం వాటా ఉంది.

ABOUT THE AUTHOR

...view details