తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​పై హోంశాఖ కొరడా

బెంగళూరు కేంద్రంగా నడిచే స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ రిజిస్ట్రేషన్​ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. విదేశీ విరాళాల స్వీకరణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలే ఇందుకు కారణం.

By

Published : May 13, 2019, 2:12 PM IST

Updated : May 14, 2019, 8:47 AM IST

ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​పై హోంశాఖ కొరడా

విదేశీ విరాళాల అంశంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ.. ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ రిజిస్ట్రేషన్​ను రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే ప్రతి ప్రభుత్వేతర సంస్థ విదేశీ నియంత్రణ చట్టం(ఎఫ్​సీఆర్​ఏ) కింద తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఎఫ్​సీఆర్​ఏ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలలకు ముందే సంస్థకు ఆదాయ, వ్యయాలు, రసీదులు, బ్యాలెన్స్​ షీట్​ తదితర వివరాలు సమర్పించాలి. ఈ సమయంలో ఎలాంటి విదేశీ నిధులు పొందకున్నా 'నిల్​' రిటర్న్​ సమర్పించాలి. అయితే.... ఈ వివరాలు సమర్పించనందుకు ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​కు గతేడాది సంజాయిషీ నోటీసులు జారీ చేసింది కేంద్రం. ఇప్పుడు రిజిస్ట్రేషన్​ రద్దు చేసింది.

ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కూడా ధ్రువీకరించింది. 2016లో చేసిన చట్ట సవరణ మేరకు తమ సంస్థ విదేశీ నిధుల నియంత్రణ చట్టం పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి రిషి బసు కృతజ్ఞతలు తెలిపారు.

వార్షిక నివేదికలు సమర్పించని దాదాపు 1,755 ఎన్​జీఓలకు గతేడాది షోకాజ్​ నోటీసులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ​

విస్తృత సేవలే ధ్యేయంగా...

భారత దేశంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1996లో ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ ఏర్పాటైంది. విద్య, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, కళలు, సంస్కృతి, నిరుపేదలకు ఎన్నో విధాలుగా సహకారం అందిస్తుంది.

ఇదీ చూడండి:లండన్​ బాబుకు వెండి మొలతాడు, హనుమాన్​ లాకెట్

Last Updated : May 14, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details