తెలంగాణ

telangana

ట్విట్టర్​ నుంచి వైదొలుగుతున్నా: ఎలాన్​ మస్క్​

By

Published : Nov 2, 2019, 10:24 AM IST

Updated : Nov 2, 2019, 7:28 PM IST

ట్విట్టర్​ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు టెస్లా చీఫ్ ఎలాన్​ మస్క్ తెలిపారు. ఆయనకు ట్విట్టర్​లో 29 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఎలాన్ మస్క్

టెస్లా చీఫ్​ ఎలాన్​ మస్క్​ ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు తన చివరి ట్వీట్​లో పేర్కొన్నారు. బహుశా ఆయన.. ప్రముఖ వార్తా, చర్చా వేదిక అయిన రెడ్డిట్ అనుకూలంగా ఈ చర్య తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాన్​కు ట్విట్టర్​లో 2 కోట్ల 9 లక్షల మంది అభిమానులు ఉన్నారు.

ఎలాన్​ మస్క్​ తరచుగా ట్వీట్​లు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు. యూఎస్ సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్ఛేంజి కమిషన్​తోనూ విబేధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఎలాన్​ మస్క్​ తన ట్వీట్​లతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టిస్తున్నారని యూఎస్ సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్ఛేంజి కమిషన్ ఆరోపించింది.

"ట్విట్టర్​ మంచి గురించి నాకు కచ్చితంగా తెలియదు. రెడ్డిట్​ చాలా బాగుంది. అయితే నేను ఆఫ్​లైన్​లోకి వెళ్తున్నాను."- ఎలాన్​ మస్క్​, టెస్లా చీఫ్​

మస్క్ చివరి ట్వీట్​

పరువునష్టం కేసు

గతేడాది థాయిలాండ్​లోని నీటి అడుగున ఉన్న గుహలో చిక్కుకున్న 12 మంది బాలలను నాటకీయంగా రక్షించడంలో సహకరించిన వ్యక్తి.. ఎలాన్​ మస్క్​పై పరువునష్టం కేసు వేశారు. ఎలాన్​ మస్క్​... అతడిని 'పెడో గాయ్' అంటూ ట్వీట్​ చేయడమే ఇందుకు కారణం.

అయితే... కేవర్​ను నిందించడం తన ఉద్దేశ్యం కాదని మస్క్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఈ పదాన్ని సాధారణంగా వాడుతుంటారని తెలిపాడు. 'పెడో గాయ్'​ అంటే.. 'భయంగొలిపే వృద్ధుడు' అని అర్థం. ఈ కేసు డిసెంబర్​ 2న విచారణకు రానుంది.

ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్​ మస్క్ ప్రకటించడంపై అతని ఫాలోవర్లు విచారం వ్యక్తం చేశారు. ఆన్​లైన్​లో మస్క్ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: సెల్​ఫోన్లు 30 సెకన్లు ట్రింగ్ ట్రింగ్ అనాల్సిందే..!

Last Updated : Nov 2, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details