తెలంగాణ

telangana

ETV Bharat / business

లక్ష్యానికి లక్ష కోట్లు

ముద్రా యోజన లక్ష్యాలను చేరుకునేందుకు మరో రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వడం అవసరమని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.

By

Published : Mar 3, 2019, 3:41 PM IST

ముద్రా యోజన

ముద్రా రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా దాదాపు రూ. లక్ష కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకు మిగిలి ఉన్న గడువు కొద్దిరోజులే. ప్రభుత్వం ప్రకటించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

మార్చి 31తో ముగియనున్న 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.3లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలన్నది ముద్రా పథకం లక్ష్యం.

ఆర్థిక శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 22 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు ముద్రా పథకం కింద రూ. 2,10,758.51కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వాటిలో రూ.2,02,668.9 కోట్లు లబ్ధిదారులకు అందించాయి. మొత్తం 3.89 కోట్ల ముద్రా రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశాయి.

గత ఆర్థిక సంవత్సరం (2017-2018)లో ప్రభుత్వ లక్ష్యాన్ని దాటి రూ. 2,46,437.40 కోట్ల ముద్రా రుణాలు మంజూరయ్యాయి.

నాన్​ కార్పొరేట్​, వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు 2015 ఏప్రిల్​ 8న మైక్రో యూనిట్స్​ డెవలప్​మెంట్​ అండ్​ రీఫైనాన్స్​ ఏజెన్సీ లిమిటెడ్​ (ముద్రా)ను ప్రభుత్వం ప్రారంభించింది.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2019-20 మధ్యంతర బడ్జెట్​లో ఇప్పటి వరకు 15.56 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. వీటి విలువ మొత్తం రూ. 7.3 లక్షల కోట్లు. రుణాలు పొందిన వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారని పీయూష్ గోయల్​ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details