తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా-చైనా చర్చలతో లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 225 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 64 పాయింట్లు వృద్ధి చెందింది.

By

Published : Jul 1, 2019, 9:45 AM IST

స్టాక్ మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడొచ్చనే అంచనాల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. జీ20 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​ వాణిజ్య చర్చలకు అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 225 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,619 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 11,853 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎన్​టీపీసీ, టాటా స్టీల్, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఎస్​ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, మారుతి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ప్రత్యేకం: జీఎస్టీ ప్రస్థానానికి రెండేళ్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details