తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 12:46 PM IST

ETV Bharat / business

అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా

ప్రభుత్వ ఉపశమనం లేకపోతే... వొడాఫోన్​-ఐడియా సంస్థను మూసివేయక తప్పదని ఆ సంస్థ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్​ టైమ్స్ లీడర్​షిప్​ సమ్మిట్​లో ఆయన ఈ విధంగా స్పందించారు. బిర్లా వ్యాఖ్యల నేపథ్యంలో సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.

Vodafone Idea will shut in absence of govt relief: Birla
అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా


ఏజీఆర్​ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుతో పీకల్లోతు కష్టాలు కూరుకుపోయిన వొడాఫోన్​-ఐడియా సంస్థ ఛైర్మన్​ కుమార మంగళం బిర్లా... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజీఆర్​ ఛార్జీల చెల్లింపు విషయంలో తమకు ఎలాంటి ఊరట లభించకపోతే సంస్థను మూసివేయక తప్పదని ఆవేదన వ్యక్తంచేశారు. దిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్​ లీడర్​షిప్​ సమ్మిట్​లో ఈ వ్యాఖ్యలు చేశారు బిర్లా.

"ప్రభుత్వ ఉపశమనం లేనప్పుడు .. మేము దుకాణం మూసుకోవాల్సి ఉంటుంది."
- కుమార మంగళం బిర్లా, వొడాఫోన్​-ఐడియా ఛైర్మన్​

ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే.. బిర్లా గ్రూప్​ మున్ముందు వొడాఫోన్​-ఐడియాలో ఎలాంటి పెట్టుబడులు పెట్టదని సంకేతాలు ఇచ్చారు బిర్లా. ఫలితంగా సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.

ఎందుకింత కష్టం..?

స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని ఏజీఆర్‌(అడ్జెస్టెడ్ గ్రాస్​ రెవెన్యూ) ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్‌ ఫీజుగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాలి.

1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్‌) కింద ఏజీఆర్‌ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపై వివాదం రాజుకొంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టెలికాం సంస్థలన్నీ కేంద్రానికి ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారతీ ఎయిర్​టెల్ గ్రూప్- రూ.62,187.73 కోట్లు, వొడాఫోన్ ఐడియా- రూ.54,183.9 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్​-ఐడియా రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది.

ఇదీ చూడండి:సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details