తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2020, 8:07 AM IST

ETV Bharat / business

సీఎండీ పదవీ విభజన గడువు రెండేళ్లు పొడిగింపు: సెబీ

కార్పొరేట్ల విజ్ఞప్తులు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నమోదిత కంపెనీల్లో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పదవులను విడదీయాలన్న నిబంధనల అమలును సెబీ రెండేళ్ల పాటు వాయిదా వేసింది. సెబీ నిర్ణయాన్ని ఫిక్కీ ఆహ్వానించింది.

The CMD post-partition expiration is an extension of two years: SEBI
సీఎండీ పదవీ విభజన గడువు రెండేళ్లు పొడిగింపు: సెబీ

నమోదిత కంపెనీల్లో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పదవులను విడదీయాలన్న నిబంధనల అమలును సెబీ రెండేళ్ల పాటు వాయిదా వేసింది. కార్పొరేట్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం.. అగ్రగామి 500 నమోదిత కంపెనీలు 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేదా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) పదవులను విడదీయాలి. సీఎండీ పేరిట ఒకరే నిర్వహించరాదు. ఇలా ఆ పదవులను విడదీయడం ద్వారా కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సెబీ ఉద్దేశం. ఈ నిబంధన అమలు తేదీని 2022 ఏప్రిల్‌ 1కి వాయిదా వేస్తున్నట్లు జనవరి 10న విడుదలైన ఒక నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఈ వాయిదాకు సెబీ ఎటువంటి కారణం తెలుపలేదు.

వినతుల నేపథ్యంలో..

నమోదిత కంపెనీలు ఈ నిబంధనలను పాటించడానికి ఇంకాస్త సమయం కావాలని ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ సంఘాల నుంచి సెబీకి వినతులు వెల్లినట్లు తెలుస్తోంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అగ్రగామి 500 నమోదిత కంపెనీల్లో 50 శాతం మాత్రమే ఈ నిబంధన పాటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు రెండు పదవులను సీఎండీగా విలీనం చేయడంతో బోర్డు, మేనేజ్‌మెంట్‌లో ఒకే వ్యక్తి రెండు విధాలా వ్యవహరించాల్సి వస్తోంది. ఇది వాటాదార్ల ప్రయోజనాలకు ఇబ్బందని భావించిన సెబీ ఆ పదవిని విభజించనున్నట్లు మే 2018న ప్రకటించింది. కాగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నారు.

పరిశ్రమ సంఘాల హర్షం

సెబీ నిర్ణయాన్ని ఫిక్కీ ఆహ్వానించింది. ‘ఫిక్కీ పలుమార్లు చేసిన విజ్ఞప్తుల ఫలితమే ఇది. వ్యాపార విజయాలకు యాజమాన్య కొనసాగింపు, ఏకీకృత దృక్పథం, నిర్ణయాల్లో వేగం కీలకం. కుటుంబ వ్యాపారాల్లో ఇది మరీ ముఖ్యం. ఈ నేపథ్యంలో సెబీ గడువును పొడిగించడం ఆహ్వానించదగ్గ పరిణామం’ అని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 5 ఏళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details