తెలంగాణ

telangana

ETV Bharat / business

సూచీలను భయపెట్టిన వాణిజ్య యుద్ధం

వారాంతాన్ని  నష్టాలతో ముగించాయి సూచీలు. శుక్రవారం నాటి  ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 424 పాయింట్లు  పతనమయి 36,546 వద్ద, నిఫ్టీ  125 పాయింట్లు క్షీణించి 10,943 వద్ద  ట్రేడయ్యాయి.

By

Published : Feb 8, 2019, 7:28 PM IST

స్టాక్​

వారాంతాన్ని నష్టాలతో ముగించాయి సూచీలు. శుక్రవారం నాటి ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 424 పాయింట్లు పతనమయి 36,546 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 10,943 వద్ద ట్రేడయ్యాయి.

మెటల్​, ఆటోమెబైల్​ రంగాల్లో ఆకస్మాత్తుగా సంభవించిన అమ్మకాలు సూచీల పతనానికి కారణమయయ్యాయి.

నేటి ట్రేడింగ్​లో భారీ నష్టాలు మూటగట్టకున్న సంస్థలలో టాటామోటార్స్​ మొదటి వరుసలో నిలిచింది. వేదాంత,టాటా స్టీల్స్​, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, కోల్ ఇండియా, మారుతీ,యాక్సిస్ ​బ్యాంక్​ తరువాతి స్థానాల్లో నిలిచాయి.

కోటక్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​, బజాజ్​ లాభాల్లో గడించాయి. ఎఫ్​సీజీ, ఫార్మా రంగ షేర్లకూ నేల చూపులు తప్పలేదు.

గురువారం నాటికి విదేశీ పెట్టుబడి దారులు 418 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని బీఎస్​ఈ తెలిపింది.

కారణాలేంటి?

⦁ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో భేటీకి ట్రంప్​ విముఖత చూపడంతో వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశముందన్న సంకేతాలు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. ఆందోళనకు గురైన మదుపరులు అమ్మకాలు జరిపారు.

⦁ జపాన్​,కొరియా సహా ఇతర అసియా మార్కెట్ల నష్టాలూ సూచీలను భయపెట్టాయి.

⦁ గత కొద్ది రోజులుగా తగ్గు ముఖంలో ఉన్న చమురు ధరలు స్వల్పంగా పెరగడమూ నష్టాలకు కారణం

రూపాయి బలపడింది

రూపాయి పుంజుకుంది. డాలర్​తో పోలిస్తే నేడు 32 పైసలు బలపడి, మారకపు విలువ 71.13 వద్ద స్థిరపడింది.

ABOUT THE AUTHOR

...view details