తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండేళ్ల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్​ ధర

అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో దేశంలో పెట్రోల్​ ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా ధరల పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు ధర రెండేళ్ల తర్వాత మళ్లీ గరిష్ఠ స్థాయి రూ. 83 దాటింది. నవంబర్​ 20 తర్వాత చమురు ఉత్పత్తుల ధరలు పెరగటం ఇది 13వసారి.

By

Published : Dec 5, 2020, 1:15 PM IST

Petrol prices
రెండెళ్ల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్​ ధర

దేశంలో పెట్రోల్​ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్​ ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశ రాజధాని దిల్లీలో శనివారం.. గత రెండేళ్ల తర్వాత తొలిసారిగా లీటరు పెట్రోల్​ ధర రూ.83కు చేరుకుంది.

చమురు సంస్థలు శనివారం లీటర్​ పెట్రోల్​పై 27 పైసలు, డీజిల్​పై 25 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.83.12కు, లీటర్​ డీజిల్​ ధర రూ.73.32కు చేరుకుంది. 2018, సెప్టెంబర్​ తర్వాత ఇదే అత్యధిక రేటు. నవంబర్​ 20 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచటం ఇది 13వ సారి. గత 16 రోజుల్లో లీటరు పెట్రోల్​ ధర రూ.2 పెరగగా.. డీజిల్​ రూ.2.86 మేర పెరిగింది.

ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా 90 రూపాయలకు చేరుకోగా, లీటర్‌ డీజిల్‌ ధర 80రూపాయలకు చేరింది

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందన్న నేపథ్యంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేసింది ఐసీఐసీఐ సెక్యూరిటీస్​. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఈ ఏడాది అక్టోబర్​ తర్వాత 34 శాతం మేర పెరిగినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: 2030 నాటికి పెట్రోల్​, డీజిల్​ కార్ల అమ్మకాలు బంద్​!

ABOUT THE AUTHOR

...view details