భారత ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. గడచిన 70 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రస్తుతం భారత్ వృద్ధి మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకుల్లో ఉందని.. ఎవరూ ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు రాజీవ్. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సరైన సమయంలో తగు చర్యలకు ఉపక్రమిస్తుందన్నారు. ఆ చర్యలు ఆర్థిక మందగమనాన్ని తొలగించడం సహా భారత ఆర్థిక వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి బయటపడేస్తుందని ధీమాగా చెప్పారు రాజీవ్.
కేంద్రం, ఆర్బీఐ చర్యలు
పరిస్థితి చక్కదిద్దేందుకు ఇప్పటికే కేంద్రంతో పాటు ఆర్బీఐ అనేక చర్యలు తీసుకున్నాయని తెలిపారు రాజీవ్. ద్రవ్యలభ్యత విషయంలో కొద్ది నెలలుగా ఆర్బీఐ తీసుకున్న చర్యలతో స్థిరత్వం వచ్చిందన్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రభుత్వరంగ బ్యాంకులు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో వరుసగా నాలుగు సార్లు రెపో రేటు తగ్గించడం సహా రుణగ్రహీతలకు తక్కువ వడ్డీలకు రుణాలు అందుతున్నాయని చెప్పారు. ఎన్బీఎఫ్సీల ఆస్తులు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనుగోలు చేసేలా కేంద్రం కూడా చర్యలు తీసుకుందని రాజీవ్ తెలిపారు
విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్