తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన రిటైల్​ ద్రవ్యోల్బణం.. జులైలో 3.15 శాతం

2019 జులైలో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.15 శాతానికి తగ్గింది. ఆహార పదార్థాల ధరలు ప్రియమైనప్పటికీ.. ఇంధన, విద్యుత్ ధరలు దిగిరావడం ఇందుకు దోహదపడింది.

By

Published : Aug 14, 2019, 8:30 AM IST

Updated : Sep 26, 2019, 10:54 PM IST

జులైలో 3.15 శాతానికి పరిమితమైన రిటైల్ ద్రవ్యోల్బణం

వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో స్వల్పంగా తగ్గింది. ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పటికీ... ఇంధనం, విద్యుత్​ ధరలు దిగిరావడం ఇందుకు దోహదపడింది. 2019 జూన్​లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.18 శాతం ఉండగా, జులైలో 3.15 శాతానికి తగ్గింది.

కీలక రేట్లపై నిర్ణయం తీసుకునే ముందు రిటైల్ ద్రవ్యోల్బణం రేట్లను ఆర్​బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్​బీఐ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపు కట్టడి చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పుడు జులైలో నమోదైన రిటైల్​ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత లక్ష్యమైన 4 శాతంలోపే ఉండటం గమనార్హం.

ఆహార పదార్థాల ధరల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్​ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో వరదలు, కూరగాయల ధరలు పెరగడం, ఖరీఫ్​ సాగు ఆలస్యం కావడం లాంటివి ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

కేంద్ర గణాంక కార్యాలయం లెక్కల ప్రకారం..

* జులైలో ఆహార పదార్థాల ధరల్లో 2.36 శాతం పెరుగుదల ఉంది. జూన్​లో వీటి ద్రవ్యోల్బణ రేటు 2.25 శాతంగా ఉంది.

* కూరగాయలు 2.82 శాతం చౌక అయ్యాయి. పప్పు ధాన్యాల ధరలు 6.82 శాతం మేర పెరిగాయి.

* జూన్​లో కూరగాయలు, పప్పుల ద్రవ్యోల్బణం రేట్లు వరుసగా 4.66 శాతం, 5.68 శాతంగా ఉన్నాయి.

* ఫలాల ద్రవ్యోల్బణం రేటు -4.18 శాతం నుంచి -0.86 శాతానికి చేరింది.

* ఇంధనం, విద్యుత్ విభాగం ప్రతిద్రవ్యోల్బణం -0.36 శాతంగా ఉంది. జూన్​లో ఈ విభాగం ద్రవ్యోల్బణం రేటు 2.32 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: 'సీతాకోక చిలుక' టీ పొడి... కిలో రూ.75వేలే!

Last Updated : Sep 26, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details