తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​టెల్​కి 19ఏళ్లు.. జియోకు రెండున్నరేళ్లే!

రిలయన్స్​ జియో వినియోగదారుల సంఖ్య మార్చి 2 నాటికి 30 కోట్లు దాటినట్టు సమాచారం. ప్రారంభమైన రెండున్నరేళ్లలోనే ఈ మైలురాయిని సాధించింది టెలికాం దిగ్గజం.

By

Published : Apr 14, 2019, 11:14 PM IST

ఎయిర్​టెల్​కి 19ఏళ్లు... జియోకు రెండున్నరేళ్లే!

టెలికాం రంగంలో రిలయన్స్​ జియో దూసుకుపోతోంది. సేవలు ప్రారంభించిన రెండున్నర సంవత్సరాలలో జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లు దాటింది. ఈ ఏడాది మార్చి 2నే ఈ మైలురాయిని సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జియో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

తమ నెట్​వర్క్​కు 30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జియో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్​ ప్రకటనల్లో ఇస్తోంది. 30 కోట్ల వినియోగదారులను సాధించటానికి ఎయిర్​టెల్​కు 19 సంవత్సరాలు పట్టింది.

ప్రపంచంలోనే 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదారులను పొందిన మొదటి సంస్థగా జియోకు రికార్డు ఉంది.

రెండో స్థానంపై అస్పష్టత...

డిసెంబర్​ త్రైమాసిక ఆదాయ నివేదికలో తమకు 28.4 కోట్ల వినియోగదారులు ఉన్నట్లు భారతీ ఎయిర్​టెల్​ ప్రకటించింది. అయితే సెబీకి సమర్పించిన నివేదికలో మాత్రం డిసెంబర్​ చివరి వరకు 34.02 కోట్ల వినియోగదారులు, జనవరి చివరి నాటికి 34.03 కోట్ల వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఐడియా-వొడాఫోన్​ 40 కోట్ల వినియోగదారులతో దేశంలో అతిపెద్ద నెట్​వర్క్​గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details