తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశీయంగా పసిడి, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.285కుపైగా ఎగిసింది. వెండి ధర కిలో ఏకంగా రూ.71,850కి చేరింది.

By

Published : Jun 1, 2021, 4:06 PM IST

Gold price, silver rate
బంగారం ధర, వెండి ధర

బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.285 పెరిగి.. రూ.48,892 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు రికవరీ అవుతున్న నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా రూ.952 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో రూ.71,850 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,912 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 28.32 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details