తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎంఆర్​ వాటాల కొనుగోలుకు టాటా సిద్ధం

సింగపూర్​కు చెందిన సంస్థలతో కలిసి జీఎంఆర్​లో వాటాల కొనుగోలుకు సిద్ధమైంది టాటా కంపెనీ. ఒప్పందం విలువ దాదాపు రూ.8 వేల కోట్లు.

By

Published : Mar 28, 2019, 6:46 AM IST

జీఎంఆర్​

టాటా గ్రూప్​, సింగపూర్​కు చెందిన జీఐసీ, ఎస్​ఎస్​జీ మేనేజ్​మెంట్​ సంయుక్తంగా సుమారు రూ.8 వేల కోట్లతో జీఎంఆర్​ విమానాశ్రయాల్లో వాటాల కొనుగోలుకు సన్నద్ధమవుతున్నాయి. ఒప్పందంలో భాగంగా జీఎంఆర్​ ఎయిర్​పోర్టులో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి మూడు సంస్థలు. మిగిలిన రూ.7 వేల కోట్లను జీఎంఆర్​ వద్ద నుంచి వాటాల కొనుగోలుకు వినియోగించనున్నాయి. దేశంలో అతిపెద్దదైన దిల్లీ సహా అనేక విమానాశ్రయాలను జీఎంఆర్​ నిర్వహిస్తోంది.

ఒప్పందం అనంతరం టాటా సంస్థకు 20 శాతం, జీఐసీకి 15, ఎస్​ఎస్​జీకు 10 శాతం వాటాలు దక్కనున్నాయి. జీఎంఆర్​తో ఒప్పందం ద్వారా టాటా సంస్థ మొదటి సారి విమానాశ్రాయాల అభివృద్ధి రంగంలోకి అడుగు పెట్టనుంది.

ABOUT THE AUTHOR

...view details