తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 7:17 PM IST

ETV Bharat / business

ల్యాండ్​లైన్​ నుంచి కాల్​ చేస్తే '0' చేర్చాల్సిందే!

ల్యాండ్​లైన్ నుంచి మొబైల్​కు ఫోన్​ చేసినప్పుడు సున్నా(0) చేర్చాలనే ప్రతిపాదనను టెలికాం విభాగం(డాట్​) ఆమోదించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

DoT accepts proposal on '0' prefix for all calls from landlines to mobile phones
ల్యాండ్​లైన్​ నుంచి కాల్​ చేస్తే సున్నా చేర్చాల్సిందే

దేశంలో ల్యాండ్​లైన్​​ నుంచి మొబైల్​కు ఫోన్​ చేసినప్పుడు ఇక నుంచి సున్నా(0)ను చేర్చాలి. ఈ మేరకు ట్రాయ్​ చేసిన సిఫారసును టెలికాం విభాగం (డాట్​) ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని టెలికాం సంస్థలకు సూచించింది డాట్​. ఇందుకు అనుగుణంగా ల్యాండ్​లైన్ నంబరు డయిలింగ్​ ప్యాటరన్​లో మార్పులు చేయాలని నిర్దేశించింది.

"ఈ నిబంధన అమల్లోకి వచ్చిన నాటి నుంచి ల్యాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేసినప్పుడు సున్నాను చేర్చడాన్ని అనుసరించాలి. ఈ నిబంధన గురించి ల్యాండ్​లైన్​ చందాదారులకు తెలియజేయాలి. ల్యాండ్​లైన్​ చందాదారులు సున్నాను చేర్చకుండా నంబరు డయల్​ చేసిన ప్రతిసారి ఈ ప్రకటన వినిపించాలి" అని డాట్ పేర్కొంది.

ఈ నిబంధనకు అనుగుణంగా సున్నా డయలింగ్​ సౌకర్యాన్ని చందాదారులకు కల్పించాలని అన్ని టెలికాం సంస్థలకు సూచించింది డాట్​.

ఇదీ చూడండి: మూడేళ్లలో 7 ట్రిలియన్​ డాలర్లకు డిజిటల్ చెల్లింపులు!

ABOUT THE AUTHOR

...view details