తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశలు, అనుమానాలు... ఫ్లాట్​గా ముగిసిన ​మార్కెట్లు

రెండు వరుస సెషన్ల లాభాలకు తెరపడింది. స్వల్ప నష్టాలతో సెషన్​ను ముగించాయి స్టాక్​ సూచీలు. సెన్సెక్స్​, నిఫ్టీలు 6 పాయింట్ల నష్టంతో ఫ్లాట్​గా ముగిశాయి. ఆటోమొబైల్స్​ రంగం మినహా... ఐటీ, లోహ, విద్యుత్తు రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

By

Published : Jun 27, 2019, 4:07 PM IST

Updated : Jun 27, 2019, 4:28 PM IST

ఆశలు, అనుమానాలు... ఫ్లాట్​గా ముసిగిన స్టాక్​మార్కెట్లు

జూన్​ డెరివేటివ్​లకు నేడు గడువు తీరనున్న నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్​ను ముగించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 6 పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ కూడా 6 పాయింట్లు క్షీణించింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్​ నేటి ట్రేడింగ్​ను 39 వేల 633 వద్ద ప్రారంభించింది. ఒక దశలో 39 వేల 817 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ​.. ఒడుదొడుకులకు లోనై 300 పాయింట్ల మేర కోల్పోయింది. సెషన్​ చివరకు 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 39 వేల 586 వద్ద ట్రేడింగ్​ను ముగించింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించింది. 11 వేల 850 మార్కు దిగువకు చేరింది. చివరకు 11 వేల 842 వద్ద స్థిరపడింది.

ఆటోమొబైల్స్​ రంగానికి కొనుగోళ్ల ఊతం లభించగా.. ఐటీ, లోహ, విద్యుత్తు రంగాల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.

టాటామోటార్స్​కు 3 శాతం లాభాలు..

ఎం అండ్​ ఎం, టాటా మోటార్స్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, ఐచర్​ మోటార్స్​, ఓఎన్​జీసీ, భారతీ ఇన్​ఫ్రా టెల్​ అత్యధిక లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్​ 3 శాతం లాభం పొందింది.

టెక్​ మహీంద్రా, అదానీ పోర్ట్స్​, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, యూపీఎల్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

Last Updated : Jun 27, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details