తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​ ఎఫెక్ట్​: ఒక్క రోజులో రూ.3 లక్షల కోట్లు ఉఫ్​

సంపన్నులపై అధిక పన్ను భారం మోపేలా బడ్జెట్​లో చేసిన ప్రకటనలు సహా అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 793 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 253 పాయింట్లు తగ్గింది. ఫలితంగా.. మదుపర్ల సంపద ఒక్క రోజులో రూ. 3లక్షల కోట్లు ఆవిరైంది.

By

Published : Jul 8, 2019, 3:45 PM IST

Updated : Jul 8, 2019, 5:39 PM IST

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం బడ్జెట్​ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండో సెషన్​లోనూ స్టాక్​మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గత సెషన్​లో 395 పాయింట్లు తగ్గిన బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ నేడు​ 793 పాయింట్లు కోల్పోయింది. 38 వేల 721 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ... 253 పాయింట్లు తగ్గి 11 వేల 559 వద్ద ముగిసింది.

2019లో దేశీయ మార్కెట్లు​ ఒకే రోజున ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.

ఇవీ కారణాలు...

అధిక ఆదాయం కలిగిన వారిపై సర్​ఛార్జిని పెంచుతూ బడ్జెట్​లో కీలక ప్రకటన చేసింది కేంద్రం. విదేశీ మదుపర్లు, సంపన్నులపై పన్ను భారం పెంచే ఈ నిర్ణయం మదుపర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.

అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగైన నేపథ్యంలో ఫెడరల్​ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తుందన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

ఫలితంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎల్ అండ్​ టీ, బజాజ్​ ఫినాన్స్​ వంటి దిగ్గజ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా...

ఉదయం 39వేల 476 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​... ఏ దశలోనూ కోలుకోలేదు. ఓ సమయంలో 907 పాయింట్లు పతనమై 38 వేల 605 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. చివరకు 38 వేల 721 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లో...

బజాజ్​ ఫినాన్స్​, ఓఎన్​జీసీ, హీరో మోటోకార్ప్, మారుతి, ఎల్​ అండ్​ టీ, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, టాటా మోటర్స్​, యాక్సిస్​ బ్యాంక్​ దాదాపు 9 శాతం నష్టపోయాయి.
ఎస్​ బ్యాంక్, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టెక్​ఎమ్​, ఎమ్​ అండ్​ ఎమ్​, ఇన్ఫోసిస్​ 5 శాతం వరకు లాభపడ్డాయి.

Last Updated : Jul 8, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details