తెలంగాణ

telangana

ETV Bharat / business

విమాన ప్రయాణం... ఇప్పుడు కాస్తంత ప్రియం

కేంద్ర ప్రభుత్వం 'విమాన భద్రతా రుసుము' పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఈ రుసుముల పెంపు అమల్లోకి రానుంది. ఫలితంగా విమాన టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి.

By

Published : Jun 8, 2019, 8:49 PM IST

Updated : Jun 8, 2019, 11:22 PM IST

విమాన ప్రయాణం... ఇప్పుడు కాస్తంత ప్రియం

విమాన ప్రయాణం... ఇప్పుడు కాస్తంత ప్రియం

'విమాన భద్రతా రుసుము' (ఏఎస్​ఎఫ్​) పెంచుతూ పౌరవిమానయాన మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయంతో ఇకపై విమాన ప్రయాణం కాస్తంత ప్రియంకానుంది.

భారత ప్రయాణికులకు ఏఎస్ఎఫ్​ని రూ.130 నుంచి రూ.150లకు పెంచింది పౌరవిమానయానశాఖ. విదేశీ ప్రయాణికులకైతే ఈ రుసుమును 3.25 డాలర్ల నుంచి 4.85 డాలర్లకు పెంచింది. ఈ ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇప్పటి వరకు ఉన్న 'ప్రయాణికుల సేవా రుసుము' స్థానంలో 'విమాన భద్రతా రుసుము'ను ఇటీవలే ప్రవేశపెట్టింది పౌరవిమానయాన మంత్రిత్వశాఖ. ఇందులో భాగంగా భద్రతా రుసమునూ పెంచింది. ఈ పెంపుతో టిక్కెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి.

ఇదీ చూడండి: సిరి: ఆన్​లైన్​లో 'వీలునామా' రాయండిలా...

Last Updated : Jun 8, 2019, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details